Chandrayaan-3 | చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించి.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ చరిత్రకెక్కింది. అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ నిలిచింది. అయితే చందమామపై అడుగుపెట్టిన ల్యాండర్ విక్రమ్.. కొన్ని నిమిషాల్లోనే భూమిపై ఉన్న పర్యవేక్షణ కేంద్రంతో కమ్యూనికేట్ చేసింది. చందమామపై తాజాగా తీసిన తొలి చిత్రాలను బెంగళూరులోని కమ్యూనికేట్ కేంద్రానికి పంపింది. ల్యాండర్ దిగుతున్న సమయంలో హారిజాంటల్ వెలాసిటీ కెమెరా తీసిన చిత్రాలను ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
Chandrayaan-3 Mission:
Updates:The communication link is established between the Ch-3 Lander and MOX-ISTRAC, Bengaluru.
Here are the images from the Lander Horizontal Velocity Camera taken during the descent. #Chandrayaan_3#Ch3 pic.twitter.com/ctjpxZmbom
— ISRO (@isro) August 23, 2023