హైదరాబాద్ : రైల్వే ట్రాక్లపై మరమ్మతుల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి త్రివేండ్రం వెళ్లే రైలును దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎట్టుమన్నార్-కురుపంటారా సెక్షన్ల మధ్య గిర్డర్ బ్రిడ్జీ మరమ్మతు నిర్వహిస్తున్న నేపథ్యంలో రైళ్ల రాకపోకలను నిలిపి వేయాల్సి వచ్చింది. దీంతో ఆ మార్గంలో నడుస్తున్న సికింద్రాబాద్-త్రివేండ్రం రైలుతోపాటు సిల్చార్-త్రివేండ్రం సెంట్రల్ రైలును ఎర్నాకులం, అలపూజా, కాయన్కులం మీదుగా దారి మళ్లించి, ఈ రైళ్లు ఎర్నాకులం టౌన్, కొట్టాయం, కాయన్కులం స్టేషన్ల మీదుగా రద్దు చేశామని తెలిపారు. అదనంగా హరిపాడ్, అంబలాపూజ, అలపూజా, చెర్టాలా స్టేషన్లలో రైళ్లు ఆగుతాయని, ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గుర్తించాలని తెలిపారు.