బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప రెండోసారి కరోనా బారినపడ్డారు. ఎనిమిది నెలల కిందట ఆయనకు కరోనా రాగా, శుక్రవారం మరోసారి జరిపిన పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది. 78 ఏండ్ల యెడియూరప్ప.. వైద్యుల సూచన మేరకు చికిత్స కోసం ఒక ప్రైవేటు దవాఖానలో చేరారు. గతేడాది ఆగస్టులో యెడియూరప్పకు కరోనా పాజిటివ్ అని తేలడంతో దవాఖానలో చికిత్సపొంది డిశ్చార్జి అయ్యారు. గత నెలలో ఆయన కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ వేసుకున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్కు కూడా కరోనా సోకింది.