ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ అంటూ వేరు కుంపటి పెట్టి.. కొన్ని రోజులు నడిపించి, మళ్లీ సమాజ్వాదీలో కలిపేశారు శివపాల్ యాదవ్. శివపాల్ యాదవ్ అఖిలేశ్కు స్వయానా బాబాయి. కొన్ని రోజుల క్రితం హఠాత్తుగా అఖిలేశ్ శివపాల్ యాదవ్ ఇంటికి వెళ్లి, చర్చలు జరిపారు. సమాజ్వాదీలో కలిసిపోయారు. ఇక్కడి వరకూ అంతా సవ్యంగానే సాగింది. సరిగ్గా.. ఎన్నిలక మొదటి దశ సమీపిస్తున్న వేళ.. అఖిలేశ్పై అలిగారు శివపాల్. ఎన్నికల సందర్భంగా తాము 100 సీట్లు ఇవ్వాలని అఖిలేశ్ను డిమాండ్ చేశామని, అఖిలేశ్ మాత్రం కేవం ఒకే ఒక్క సీటుతో సర్దిపెట్టారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా… తాను అఖిలేశ్తోనే వుంటానని శివపాల్ స్పష్టం చేశారు. మా పార్టీ తరపున అఖిలేశ్ను 100 సీట్లు డిమాండ్ చేశాం. మరీ ఎక్కువ అని అఖిలేశ్ అన్నారు. దీంతో తాము 50 సీట్లకు దిగాం. కుదరదన్నారు. 30 సీట్లు డిమాండ్ చేశాం. అయినా ఒప్పుకోలేదు. చివరికి ఒక్క సీటు ఇచ్చారు అంటూ శివపాల్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.