న్యూఢిల్లీ: కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య డీల్ కుదిరింది. లోక్సభ ఎన్నికల్లో(Loksabha Polls) ఢిల్లీలో రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఢిల్లీలో మొత్తం ఏడు లోక్సభ స్థానాలు ఉన్నాయి. అయితే రెండు పార్టీల మధ్య పలు దఫాలు జరిగిన చర్చల తర్వాత ఓ నిర్ణయం తీసుకున్నారు. 4-3 ఫార్ములాతో సీట్ షేరింగ్ జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేయనున్నది. కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలకే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. సీట్ షేరింగ్ అగ్రిమెంట్ జరిగినట్లు ఆప్ నేత ఒకరు వెల్లడించారు. అయితే ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న విషయాన్ని త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు.