లక్నో: ఒక రెస్టారెంట్లో ఏకంగా సుమారు వెయ్యి రూపాయలు సర్వీస్ ఛార్జీ విధించారు. కస్టమర్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కస్టమర్లు, సిబ్బంది మధ్య ఫైట్ జరిగింది (Scuffle breaks out). ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం సెక్టార్ 75లో ఉన్న స్పెక్ట్రమ్ మాల్లోని డ్యూటీ ఫ్రీ రెస్టారెంట్కు 12-13 మంది ఉన్న ఒక కుటుంబం వెళ్లింది. ఫుడ్ తిన్న తర్వాత బిల్లు చూసి వారు షాకయ్యారు. బిల్లులో రూ.970 సర్వీస్ ఛార్జ్ విధించారు. ఆ కుటుంబ సభ్యులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా విధించిన సర్వీస్ ఛార్జ్ను బిల్లు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
కాగా, రెస్టారెంట్ సిబ్బంది దీనికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వాదం చివరకు ఘర్షణకు దారి తీసింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు, రెస్టారెంట్ సిబ్బంది తిట్టుకోవడంతోపాటు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు, ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఆ రెస్టారెంట్కు చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని అదుపు చేశారు. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేశారు. స్పెక్ట్రమ్ మాల్లోని ఆ రెస్టారెంట్ను మూడు నెలల కిందటే ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
Kalesh b/w Bouncers and Family over service charge at spectrum mall sector 50pic.twitter.com/do9lk72bLx
— Ghar Ke Kalesh (@gharkekalesh) June 18, 2023