భారత శాస్త్రవేత్తల అభివృద్ధి
న్యూఢిల్లీ, జూలై 15: శరీర కణాల్లోకి ప్రవేశించకుండా కొవిడ్ వైరస్ను నిర్వీర్యం చేసే నూతన విధానాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు.
ఈ విధానం సాయంతో వైరస్ కణాలను ఒక ముద్దగా మార్చుతూ.. వాటి సంక్రమణ శక్తిని తగ్గించవచ్చని పేర్కొన్నారు. కొత్త ఉత్పరివర్తనాలతో రూపు మార్చుకుంటున్న కరోనా మహమ్మారి నియంత్రణకు ఈ విధానం ఎంతగానో సాయపడుతుందని శాస్త్రసాంకేతిక మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.