ఇంఫాల్: బీజేపీ పాలిత మణిపూర్లో మళ్లీ నిరసనలు ఉధృతమయ్యాయి. దీంతో శాంతిభద్రతల పరిస్థితి కారణంగా స్కూల్స్, కాలేజీలు, విద్యా సంస్థలను మూడు రోజులపాటు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. (Manipur Protests) మణిపూర్లో జనాభా గణనకు ముందే జాతీయ పౌర పట్టిక (ఎన్సార్సీ)ని నవీకరించాలని ప్రజలు కోరుతున్నారు. అంతర్గతంగా స్థానభ్రంశం చెందిన వ్యక్తులు (ఐడీపీలు) తమ స్వస్థలాలకు తిరిగి వచ్చేవరకు జనాభా గణన నిర్వహించవద్దని డిమాండ్ చేస్తున్నారు. న్యాయమైన, నిష్పక్షపాత పునర్విభజన ప్రచార సంస్థ (జేఎఫ్డీ) వేదికగా దీనిపై పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 48 గంటల సార్వత్రిక సమ్మెకు జేఎఫ్డీ పిలుపునిచ్చింది.
కాగా, సమ్మెలో భాగంగా మణిపూర్ లోయ జిల్లాలలోని పలు ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు జరిగాయి. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్, తౌబల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రోడ్లను దిగ్భందించారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఖురాయ్ లామ్లాంగ్లో సీఎం ఖేమ్చంద్ సింగ్, హోం మంత్రి గోవిందాస్ కొంతౌజమ్ల దిష్టిబొమ్మలను నిరసనకారులు దహనం చేశారు.
మరోవైపు సార్వత్రిక సమ్మెలో భాగంగా నిరసనలు కొనసాగడంతో గురువారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను బహిష్కరిస్తున్నట్లు జేఎఫ్డీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితి కారణంగా ఆగస్ట్ 20 నుంచి 22 వరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది. తౌబల్ జిల్లాలో ఏర్పాటు చేసిన జనగణన శిక్షణా కార్యక్రమాన్ని కూడా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
#WATCH | Manipur | People hold protests in Imphal under the Campaign for Just and Fair Delimitation’s (JFD) call, demanding the conduct and update of the National Register of Citizens (NRC) before the Census. Police put up barricades to control the crowd.
A protestor says, “We… pic.twitter.com/2C6xO3nHnK
— ANI (@ANI) August 20, 2026