తమిళనాడు అంతటా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ బస్సులో మద్యం సేవించారు. ఆ గ్రూపులోని ఓ విద్యార్థే దీనిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. విద్యార్థినీ, విద్యార్థులు కలిసి..ఓ బీర్ బాటిల్ను ఓపెన్ చేసి, తాగుతున్నట్లు ఇందులో కనిపించింది. వీరంతా చెంగల్పట్టులోని ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులని తెలుస్తోంది. మొదట్లో ఇది పాత వీడియో అని అందరూ అనుకున్నారు. కానీ మంగళవారం రోజే ఇది జరిగిందని ఆ తర్వాత తెలిసింది.
ఇలా ఓ బస్సులో మద్యం సేవిస్తున్న సమయంలో వారంతా స్కూల్ యూనిఫామ్లోనే ఉన్నారు. వీరు తిరుకజుకుండ్రం నుంచి థాచూర్కు వెళ్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో జిల్లా విద్యాధికారి స్పందించారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లిందని, పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారని తెలిపారు. విచారణ ముగిసిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.