లక్నో : విద్యార్థులకు పరీక్షల్లో వింత ప్రశ్న ఎదురైంది. పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నలేనా అడిగేదంటూ తల్లిదండ్రులు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటే ప్రముఖ బాలీవుడ్ దంపతులు కరీనా కపూర్ సైఫ్ అలీఖాన్ల కొడుకు పేరేంటి? అనే ప్రశ్న ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్పందించిన విద్యాశాఖ సదరు పాఠశాల నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మధ్యప్రదేశ్ ఖాండ్వా జిల్లాల్లోని అకడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్ పరీక్ష నిర్వహించింది. ఇందులో కరంట్ అఫైర్ విభాగంలో ఐదు ప్రశ్నలు ఇచ్చింది.
ఇందులో తొలి ప్రశ్న భారత్లో చెస్ మొదటి గ్రాండ్ మాస్టర్ ఎవరు?.. రెండో ప్రశ్నగా కరీనా కపూర్ ఖాన్ – సైఫ్ అలీ ఖాన్ కొడుకు పూర్తి పేరు రాయాలని చెప్పింది. ఇదే సెట్లో మరో మూడు ప్రశ్నల్లో పాక్లో కుప్పకూలిన ఏఎఫ్ఐ పైలట్ పేరు?.. 2019లో ఐపీఎల్ కప్ గెలిచిన జట్టు ఏదీ?.. ఉత్తర కొరియా నియంత ఎవరు? అని ప్రశ్నలు ఇచ్చింది. పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నలు వేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధులు గురించైనా, విద్యార్థుల విజ్ఞానాన్ని పెంచేలా ప్రశ్నలుండాలని కానీ.. బాలీవుడ్ నటుల పేర్లెందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చివరకు మధ్యప్రదేశ్ విద్యాశాఖ దృష్టికి వెళ్లగా.. సంబంధిత అకడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ పరిపాలనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.