న్యూఢిల్లీ: 2024 లోక్సభ ఎన్నికలకు(Lok Sabha Elections) చెందిన షెడ్యూల్ను శనివారం ప్రకటించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్రం ఎన్నికల సంఘం దీనిపై ప్రకటన చేయనున్నది. దీంతో రేపటి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నది. లోక్సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీపై కూడా ప్రకటన వెలుబడనున్నది. ఈసారి నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ లేదా మే నెలలో ఓటింగ్ జరిగే రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం సోషల్ మీడియా ఫ్లాట్ఫాముల్లో ఈసీ ప్రెస్మీట్ లైవ్ కానున్నది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలకు మాత్రం ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.
చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్.. లోక్సభ ఎన్నికల తేదీలపై ప్రకటన చేస్తారు. ఆ ప్రెస్మీట్లో కొత్త కమీషనర్లు జ్ఞానేంద్ర కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూ కూడా పాల్గొంటారు. విజ్ఞాన్ భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్మీట్ జరగనున్నది. అయితే జమ్మూకశ్మీర్కు జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ ప్రకటన చేస్తుందా లేదా అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. 2019లో ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల తేదీలను మార్చి 10వ తేదీన ప్రకటించిన విషయం తెలిసందే.