న్యూఢిల్లీ, నవంబర్ 9: కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నోట్లరద్దు నిర్ణయంపై కేంద్రం అఫిడవిట్ సమర్పించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం ‘చాలా ఇబ్బందికరం’గా ఉన్నదని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో నోట్లరద్దు వెనుక నిర్ణయాత్మక ప్రక్రియ పరిశీలనను జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 24కు వాయిదా వేసింది.
2016లో తీసుకొన్న నోట్లరద్దు నిర్ణయంపై సమగ్రమైన అఫిడవిట్ సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్రం, ఆర్బీఐలను గత నెల 11న కోరింది. అదేవిధంగా ఆర్బీఐకి కేంద్రం రాసిన లేఖ, ఆర్బీఐ బోర్డు నిర్ణయం, నోట్లరద్దు ప్రకటనకు సంబంధించిన ఫైల్స్ను సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నది. అఫిడవిట్ దాఖలు చేయడంలో విఫలమైన నేపథ్యంలో మరి కొంత సమయం కావాలని కేంద్రం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకట రమణి కోర్టును కోరారు.