Supreme court | న్యూఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో ప్రసంగించడానికి లేదా ఓటు వేయడానికి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నపుడు, వారికి విచారణ నుంచి మినహాయింపు ఉంటుందా? అనే అంశంపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు చెప్పబోతున్నది. ఈ అంశంపై రాజ్యాంగ ధర్మాసనం 2023 అక్టోబరు 5న తీర్పును రిజర్వు చేసింది.
సోమవారం తీర్పు వెల్లడించనుంది. జేఎంఎం లంచం కేసులో 1998లో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్తూ, ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో ప్రసంగించడానికి లేదా ఓటు వేయడానికి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నపుడు, వారికి విచారణ నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఈ తీర్పును ధర్మాసనం పునఃపరిశీలించింది.