న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ఈవీఎంలు, బ్యాలెట్ పత్రాలపై ఉండే పార్టీ గుర్తులను తొలగించి వాటి స్థానంలో అభ్యర్థుల విద్యార్హతలు, వయసును ముద్రించేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీనిపై సోమవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. విద్యావంతుడు, తెలివిగలవాడు, నిజాయితీపరుడు ఎవరో అన్న విషయాన్ని తెలుసుకొని ఓటు వేయడానికి ఓటరుకు అవకాశముండాలంటే ఈ మార్పు చేయాలని పిటిషనర్, న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ కోరారు. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు సోమవారం వాదనలు వింటామని పేర్కొంది.