న్యూఢిల్లీ: అస్సాం ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ(Himanta Biswa Sarma) తెలిపారు. లవ్ జిహాదీకి పాల్పడుతున్న కేసులు పెరుగుతున్నాయని, వాటిని అదుపు చేసేందుకు కఠినమైన చట్టాన్ని తెస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అస్సాంలో లవ్ జిహాదీ ఎక్కువగా ఉందని, ఫేస్బుక్పై హిందువుల ఫోటోలు పెట్టి, అమ్మాయిలకు వలవేసి వెళ్లి చేసుకుంటున్నారని, కొన్నాళ్లకు ఆ అబ్బాయి హిందువు కాదు అని అమ్మాయి గుర్తిస్తోందని, అయితే బాధితురాలికి న్యాయం జరగాలని, అయిదేళ్లుగా తమ ప్రభుత్వ అనేక కేసుల్ని పరిశీలించిందని, దాని ఆధారంగా కఠిన చట్టాన్ని తయారు చేయనున్నట్లు సీఎం బిశ్వ శర్మ తెలిపారు. అమ్మాయిలను అట్రాక్ట్ చేసేందుకు తమ ఐడెంటిటీని దాచిపెడుతున్న వారికి కఠిన శిక్ష అమలయ్యేలా చట్టాన్ని రూపొందిస్తున్నట్లు సీఎం చెప్పారు.
ఇక అస్సాంలో ఉన్న విభిన్న భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా.. ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ ప్రజలు మైనార్టీలుగా మారిపోతున్నారని, ఇక వాళ్లకు చెందిన భూములను .. అక్రమ రీతిలో కొనుగోలు చేస్తున్నారని, ఇక నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలు తమ భూముల్ని కేవలం వాళ్ల సామాజిక వర్గానికి మాత్రమే అమ్మేలా చట్టాన్ని రూపొందిస్తున్నట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
#WATCH | Assam CM Himanta Biswa Sarma says “Our government is in the process of drafting legislation which will give higher punishment for cases of love Jihad. In Assam, this is rampant. People put their Hindu names on Facebook, lure a girl and after marriage the girl discovers… pic.twitter.com/VWzxsmuTz2
— ANI (@ANI) August 5, 2024