న్యూఢిల్లీ, మే 31: చట్టసభ సభ్యుల పిటిషన్లను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్వీకరించడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవడంపై ఎన్జీటీని ప్రశ్నించింది. కోర్టులకు రాలేని సామాన్యుల గోడు వినేందుకే ఎన్జీటీ ఉన్నదని, పార్లమెంట్ సభ్యుల కోసం కాదని పేర్కొంది.
విశాఖలోని రిషికొండలో చేపడుతున్న నిర్మాణం సీఆర్జడ్ నిబంధనలకు విరుద్ధమని లోక్సభ ఎంపీ కే రఘురామకృష్ణ రాజు ఎన్జీటీలో పిటిషన్ వేశారు. దీంతో ప్రాజెక్టును నిలిపివేయాలంటూ ఎన్జీటీ ఆదేశాలిచ్చింది. ఈ తీర్పును ఏపీ సర్కారు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారించిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.