న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వచ్చేనెల 31న వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థులకు భారత పౌరసత్వాన్ని ఇచ్చేందుకుగాను సీఏఏను కేంద్రం తీసుకొచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను తేల్చాలంటూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు వచ్చేనెల 31న విచారణ జరుపుతామని తెలిపింది.