న్యూఢిల్లీ: ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్(Muslim Quota)ను కర్నాటక ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దానిపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తప్పుడు అభిప్రాయాలపై కర్నాటక సర్కార్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొన్నది. వొక్కలింగ, లింగాయత్లకు చెరో రెండు శాతం రిజర్వేషన్లు పెంచేందుకు కర్నాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసి వొక్కలింగ, లింగాయత్లు రిజర్వేషన్ కల్పించడం పట్ల సుప్రీం విస్మయం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయంలో లోపాలు ఉన్నట్లు సుప్రీం పేర్కొన్నది. ఈ కేసును మళ్లీ ఏప్రిల్ 18వ తేదీ విచారించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.