న్యూఢిల్లీ, జూలై 4: తమిళనాడు మంత్రి వీ సెంథిల్ బాలాజీ అక్రమ నిర్బంధంపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ను మీరే విచారించండంటూ మద్రాస్ హైకోర్టును సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. కేసును ముగ్గురు సభ్యుల ధర్మాసనం ముందు ఉంచి, సాధ్యమైనంత త్వరగా విచారణ జరపాలని పేర్కొంది. తన భర్తను అక్రమంగా నిర్బంధించారంటూ బాలాజీ భార్య దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై మద్రాస్ హై కోర్టు డివిజన్ బెంచ్ జస్టిస్లు జే నిషా బాను, డీ భరత చక్రవర్తి భిన్న తీర్పులు చెప్పారు.
దీంతో ఈ కేసును ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ కోసం చీఫ్ జస్టిస్కు నివేదించాలని హై కోర్టు బెంచ్ రిజిస్ట్రీని ఆదేశించింది. అరెస్ట్ తర్వాత కరోనరీ బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్న మంత్రి కేసులో హైకోర్టు ఇచ్చిన భిన్న తీర్పుపై ఈడీ సుప్రీంను ఆశ్రయించింది. బాలాజీ అక్రమ అరెస్ట్పై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ ఇంకా హై కోర్టులోనే పెండింగ్లో ఉన్నందున హైకోర్టునే ఆశ్రయించాలని ధర్మాసనం ఈడీకి సూచించింది.