న్యూఢిల్లీ, జూన్ 9: మహిళా రెజ్లర్లపై డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ఆగడాలకు తాను ప్రత్యక్ష సాక్షినని అంతర్జాతీయ రెజ్లిం గ్ రెఫరీ జగ్బీర్సింగ్ పేర్కొన్నారు. రెజ్లర్లపై బ్రిజ్ పాల్పడిన లైంగిక వేధింపులను 2013 నుంచి పలు సందర్భాల్లో కండ్లారా చూశానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెఫరీ జగ్బీర్ సింగ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ 2022, మార్చి 25న లక్నోలో జరిగిన ఆసియన్ చాంపియన్షిప్ సమయంలో జరిగిన ఫొటోసెషన్ సందర్భంగా ఓ మహిళా రెజ్లర్ను బ్రిజ్భూషణ్ అసభ్యకరంగా తాకాడని పేర్కొన్నారు. అంతకుముందు 2013లో థాయ్లాండ్లో జరిగిన మరో ఘటనలో కూడా ఓ మైనర్ రెజ్లర్ను ఇదేవిధంగా వేధింపులకు గురిచేశాడని చెప్పారు.