న్యూఢిల్లీ : తీహార్ జైలులోని బాత్రూంలో గురువారం ఉదయం ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ (Satyendar Jain) కుప్పకూలిన అనంతరం దీన్దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించారు. ఆపై మెరుగైన చికిత్సను అందించేందుకు ఎన్జేపీ ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్ అందించారు.
ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో సత్యేందర్ జైన్ను ఆస్పత్రికి తీసుకురావడం ఈ వారంలో ఇది రెండవసారి. గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో సెల్ నెంబర్ 7లోని బాత్రూంలో జైన్ కుప్పకూలారని తీహార్ జైల్ డీజీ తెలిపారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించగా అక్కడ పలు వైద్య పరీక్షలు నిర్వహించారని చెప్పారు. సత్యేందర్ జైన్కు వెన్నెముక సర్జరీ చేయాల్సి ఉందని ఆయన తెలిపారు.
తనకు నీరసంగా ఉందని చెప్పడంతో జైన్ వైద్యుల పరిశీలనలో ఉన్నారని మరో జైలు అధికారి వివరించారు. జైన్ వెన్నునొప్పితో పాటు ఎడమ కాలు, భుజం నొప్పితో బాధపడుతున్నారని వెల్లడించారు. మనీ ల్యాండరింగ్ కేసులో గత ఏడాది ఈడీ అధికారులు అరెస్ట్ చేసినప్పటి నుంచి మాజీ మంత్రి సత్యేందర్ జైన్ ఏకంగా 35 కిలోల బరువు తగ్గారని ఆప్ వర్గాలు పేర్కొన్నారు.
Read More