ఢిల్లీ : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీల్యాండరింగ్ కేసులో ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ బెయిల్ దరఖాస్తును సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం శనివారం తోసిపుచ్చింది. మే 30న మనీల్యాండరింగ్ కేసులో సత్యేందర్ జైన్ను ఈడీ అరెస్ట్ చేసింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి కుటుంబసభ్యుల పేరిట ఉన్న రూ 4.81 కోట్ల విలువైన ఆస్తులను ఈ ఏడాది ఏప్రిల్లో ఈడీ అటాచ్ చేసింది. ఈడీ కస్టడీ ముగియడంతో సత్యేందర్ జైన్ను జూన్ 13న జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. జైన్ బెయిల్ దరఖాస్తును తిరస్కరిస్తున్నట్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గీతాంజలి గోయల్ స్పష్టం చేశారు.