Satyendar Jain : ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్కు భారీ ఊరట లభించింది. జల్ బోర్డు కేసులో అరెస్టైన ఆయనకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచీకత్తు, ఇద్దరు సంతకాల హామీతో సత్యేంద్ర జైన్కు బెయిల్ లభించింది.
పీసీ యాక్ట్ కింద స్పెషల్ జడ్జి సత్యేంద్ర జైన్కు బెయిల్ ఇస్తున్నట్లు ప్రకటించారు. సత్యేంద్ర జైన్ గతంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఈ సమయంలో ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)లో జరిగిన అవినీతి కేసులో గత ఆగష్టు 18న సత్యేంద్ర జైన్ను ఢిల్లీలో ఏసీబీ అరెస్టు చేసింది. డీజేబీలో మురికినీటి శుద్ధీకరణ ప్లాంట్ టెండర్ల ప్రక్రియలో అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి ఇందులో మంత్రి సత్యేంద్ర జైన్తోపాటు డీజేబీ సీఈవో ఉదిత్ ప్రకాష్ రాయ్, మాజీ కాంట్రాక్టువల్ కన్సల్టెంట్ అంకిత్ శ్రీవాస్తవతోపాటు మరో ఇద్దరిని ఏసీబీ అరెస్టు చేసింది.
తన అరెస్టుకు వ్యతిరేకంగా సత్యేంద్ర జైన్ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు గురువారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ అరెస్టును ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. రాజకీయ కుట్రలో భాగంగానే ఆయనను అరెస్టు చేశారని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈ అంశంలో బీజేపీ, ఆప్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు నడిచాయి.