తమిళ రాజకీయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ సూపర్ స్టార్ రజనీకాంత్తో భేటీ అయ్యారు. చెన్నైలోని రజనీకాంత్ నివాసానికి వెళ్లి, శశికళ భేటీ అయ్యారు. ఈ సమయంలో రజనీకాంత్ భార్య లత కూడా ఉన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కె అవార్డును అందుకున్న సందర్భంగా రజనీకాంత్కు శుభాకాంక్షలు తెలిపారు శశికళ. అయితే అన్నాడీఎంకేలో పదవుల పందేరం పూర్తై, శశికళకు చుక్కెదురైన సమయంలో సూపర్ స్టార్ను కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ సమన్వయ కర్తగా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపడితే, ఉప సమన్వయకర్తగా పళని స్వామి బాధ్యతలు చేపట్టారు. పార్టీని తన చెప్పుచేతల్లోకి తీసుకోవాలని శశికళ భావిస్తున్న వేళ, వీరిద్దరూ ఓ అవగాహనకు రావడం గమనించాల్సిన పరిణామం.