న్యూఢిల్లీ : దూరదర్శన్లో పనిచేసిన ప్రముఖ న్యూస్ యాంకర్ సరళా మహేశ్వరి(71) గురువారం న్యూఢిల్లీలో కన్నుమూశారు. 1970-80 దశకంలో దూరదర్శన్లోని ప్రముఖ న్యూస్ రీడర్లలో ఆమె ఒకరు. 1976లో పీహెచ్డీ చేస్తున్న సమయంలో ఆమె దూరదర్శన్లో ఉద్యోగంలో చేరారు.
భారత టెలివిజన్ చరిత్రలో ప్రత్యక్ష ప్రసార వార్తలు చదివిన మొదటి కొద్ది మంది న్యూస్ రీడర్లలో ఆమె ఒకరు. 1986-1988 వరకు ఆమె యూకేలో బీబీసీ న్యూస్ రీడర్గా పనిచేసి మళ్లీ తిరిగి దూరదర్శన్లో చేరారు. ఆమె మృతికి దూరదర్శన్ నివాళులు అర్పించింది. ఆమెది ‘మృదువైన స్వరం, కచ్చితమైన ఉచ్ఛారణ’ అని ప్రశంసించింది.