న్యూఢిల్లీ, జూన్ 1: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి కేసులో అప్రూవర్గా మారడానికి ఢిల్లీ కోర్టు గురువారం అంగీకరించింది. అరబిందో గ్రూప్నకు చెందిన శరత్ చంద్రారెడ్డిపై ఈడీ ఇటీవల చార్జిషీట్ దాఖలు చేసింది. కాగా తాను ఈ కేసులో అప్రూవర్గా మారాలనుకుంటున్నట్టు ఆయన దాఖలు చేసిన విజ్ఞప్తికి రౌస్ అవెన్యూ కోర్టు అంగీకారం తెలిపింది.
ఢిల్లీ మద్యం పాలసీలో ఇలా అప్రూవర్గా మారిన వారిలో శరత్ రెండో వారు. అంతకుముందు మద్యం వ్యాపారవేత్త దినేష్ అరోరా కూడా నవంబర్లో అప్రూవర్గా మారారు. ఈ కేసులో ఇద్దరు అప్రూవర్లుగా మారడంతో ప్రధాన నిందితునిగా ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు.