చెన్నై : రాజీవ్ హత్య కేసులో జీవితకాల శిక్ష అనుభవించి విడుదలైన సంతాన్ బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. రాజీవ్ హత్య చేసిన కేసులో సంతాన్ 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 2022లో సుప్రీంకోర్టు విడుదల చేసిన ఏడుగురిలో సంతాన్ ఒకడు.
ఇతను శ్రీలంక జాతీయుడు. 1991 నుంచి సంతాన్ లివర్ సమస్యతో బాధపడుతున్నాడు. బుధవారం గుండెపోటు కారణంగా మృతి చెందినట్టు రాజీవ్గాంధీ ప్రభుత్వ దవాఖాన వైద్యులు తెలిపారు.