Sanjay Singh | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను శుక్రవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు సంజయ్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కోర్టులో జరుపరుచగా.. ఈ నెల 24 వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన అభివృద్ధి పనులకు సంబంధించిన రెండు సమ్మతి పత్రాలను అతని తరఫు న్యాయవాది సంతకం కోసం దాఖలు చేయగా.. ఇందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో పాటు పరువునష్టం కేసులో పంజాబ్ నుంచి ప్రొడక్షన్ వారెంట్ సైతం కోర్టుకు వచ్చింది. పంజాబ్లోని అమృత్సర్ కోర్టులో సంజయ్ సింగ్ను హాజరుపరిచేందుకు ఢిల్లీ కోర్టు అనుమతించింది. ఆప్ ఎంపీని గత నెల 4న ఈడీ అరెస్టు చేసింది. తొలుత ఆయనను ఐదురోజుల పాటు ఈడీ కస్టడీకి ఇవ్వగా.. ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీని విధించింది.