ముంబై, అక్టోబర్ 20: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లక్ష్యంగా శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనకు అంతర్జాతీయ డ్రగ్ రాకెట్తో సంబంధాలు ఉన్నాయని విమర్శించారు. ఇటీవల నాసిక్లో భారీ డ్రగ్ రాకెట్ బయటపడిన క్రమంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు.
నాసిక్ డ్రగ్ సిండికేట్ ఉదంతంలో మహారాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉందని, డ్రగ్ రాకెటర్ల నుంచి వారికి ప్రతి నెలా లక్షలాది రూపాయలు ‘హఫ్తా’ తీసుకుంటున్నారని, వారి లిస్టు తన వద్ద ఉందంటూ వెల్లడించారు.