ముంబై, ఆగస్టు 30: పార్టీ కార్యకర్తలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీచేసే నోటీసు లవ్ లెటర్ అని, అదేమీ డెత్ వారంట్ కాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం తమ ఎదుట హాజరుకావాలని మహారాష్ట్ర మంత్రి అనిల్ పరాబ్కు ఈడీ నోటీసులు పంపిన నేపథ్యంలో సోమవారం రౌత్ మీడియాతో మాట్లాడారు. మహా వికాస్ అఘాదీ గోడలు బద్దలు కొట్టడానికి చేసిన ప్రయత్నాలు విఫలమైన తర్వాత ఇలాంటి ప్రేమలేఖల సంఖ్య పెరుగుతున్నదని చెప్పారు. పరాబ్ను బీజేపీ నాయకులు లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. నోటీసుకు పరాబ్ స్పందిస్తారని, ఈడీకి సహకరిస్తారని పేర్కొన్నారు.