మిర్జాపూర్, డిసెంబర్ 23: యుద్ధ విమానం నడుపాలని కలలు కన్నది ఆ యువతి.. తన కలను సాకారం చేసుకోవడానికి నిత్యం శ్రమించింది. చివరికి నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్షలో విజయం సాధించింది. త్వరలోనే అకాడమీలో చేరి శిక్షణ పొంది యుద్ధ విమానాన్ని నడుపనున్నది సానియా మీర్జా. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో జన్మించిన ఈ యువతి స్థానిక హిందీ భాషలోనే చదువుకున్నది.
తండ్రి టీవీ మెకానిక్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే యుద్ధ విమానం తొలి మహిళా పైలట్ చతుర్వేదిని చూసి స్ఫూర్తి పొందిన సానియా తాను కూడా యుద్ధ విమాన పైలట్ కావాలని కలలు కన్నది. ఇందుకోసం నిరంతరం శ్రమించింది. ఎన్డీఏ పరీక్షలో విజయం సాధించి తన కలను సాకారం చేసుకున్నది. యుద్ధ విమానం నడిపే తొలి ముస్లిం మహిళా పైలట్గా చరిత్ర సృష్టించబోతున్నది.