కోల్కతా: సందేశ్ఖాలీలో అక్రమాలకు పాల్పడి పరారీలో ఉన్న తమ పార్టీ నేత షాజహాన్ షేక్ను వారం రోజుల్లోగా అరెస్టు చేస్తామని తృణమూల్ కాంగ్రెస్(TMC) పార్టీ సీనియర్ నేత కునాల్ ఘోష్ తెలిపారు. భూ కబ్జా, మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు షాజహాన్పై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. షాజహాన్ అరెస్టు విషయంలో ఎటువంటి స్టే ఇవ్వడం లేదని కోల్కతా హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో టీఎంసీ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయపరమైన చిక్కులు ఉన్న కారణంగా షాజహాన్ను అరెస్టు చేస్తారని టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తెలిపారు. సందేశ్ఖాలీ మహిళలు వేసిన పిటీషన్పై కోల్కతా హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టారు. ఈడీ, సీబీఐ, రాష్ట్ర హోంశాఖతో పాటు షాజహాన్ను ఆ కేసులో ప్రస్తావించారు. కోల్కతాకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న సుందర్బన్ ప్రాంతంలోని సందేశ్ఖాలీలో దాదాపు నెల రోజుల నుంచి నిరసనలు జరుగుతున్నాయి. షాజహాన్ను అరెస్టు చేయాలని మహిళలు డిమాండ్ చేశారు.