బెంగళూరు, జూన్ 13: మధుమేహ రోగు ల్లో సాధారణంగా అరికాళ్లలో గాయాలు ఏర్పడుతుంటాయి. అవి తొందరగా తగ్గవు కూడా. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువై పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుతుంది. ఈ సమస్యను తప్పించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ రిసెర్చ్ శాస్త్రవేత్తలు కొత్త రకం చెప్పులను తయారు చేశారు.
ఆ చెప్పులు మధుమేహ రోగుల నడక తీరును నియంత్రించి, గాయాలు ఎక్కువ కాకుండా అడ్డుకొంటాయట. గాయాలు త్వరగా మానేందుకు, మరోచోట కొత్త గాయాలు కాకుండా చూస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వాణిజ్యపరంగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఫూట్ సెక్యూర్, యోస్ర్తా ల్యాబ్ స్టార్టప్లతో భాగస్వామ్యం కానున్నట్టు వెల్లడించారు.