Sand snake: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అప్పుడప్పుడు వింత జీవులు చిక్కుతుంటాయి. కొన్నిసార్లు అరుదైన జీవజాతులకు చెందిన జీవులు పట్టుబడుతాయి. తాజాగా బంగాళాఖాతం తీరంలోని రుషికొండ బీచ్ సమీపంలో మత్స్యకారుల వలలో అలాంటి అరుదైన జీవులే పడ్డాయి. సముద్రంలోకి వల విసిరి బోటుపైకి లాగిన మత్సకారులకు ఆ వలలో రెండు ఇసుక పాములు దర్శనమివ్వడంతో ఖంగుతిన్నారు.
ఈ ఇసుక పాములు సాధారణంగా నాచును, సముంద్రంలోని సూక్ష్మ జీవులను ఆహారంగా తీసుకుంటాయి. సముద్ర తీరాల్లోని ఇసుకలో పీతలలాగా రంధ్రాలు ఏర్పాటు చేసుకుని సేదతీరుతాయి. అయితే ఆహార అన్వేషణలో భాగంగా సాగర జలాల్లో సంచరిస్తున్నప్పుడు ఇలా మత్సకారుల వలలకు చిక్కుతుంటాయి. ఈ పాములు కాటు వేస్తే దాదాపు కొన్ని గంటలపాటు నొప్పితో బాధపడాల్సి వస్తుందని, వైద్యులను సంప్రతిస్తే నొప్పి నుంచి తొందరగా ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. అంతేతప్ప వీటితో ప్రాణాపాయం ఉండదని అంటున్నారు. అందుకే రుషికొండ బీచ్ సమీపంలో వలకు చిక్కిన ఈ రెండు ఇసుక పాములను మత్స్యకారులు తిరిగి సముద్రంలో వదిలేశారు.
కాగా, ఈ ఇసుకపాము జాతులు భారత్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, మయన్మార్, కాంబోడియా, లావోస్, థాయ్లాండ్, వియత్నాం దేశాల్లో కనిపిస్తుంటాయి. భారత్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో ఈ జాతులు ఉంటాయి.