న్యూఢిల్లీ: లక్షల మంది యూజర్లు వినియోగిస్తున్న శామ్సంగ్ గెలాక్సీ ఫోన్ల విషయంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ-ఇన్) హెచ్చరికలు చేసింది.
శామ్సంగ్ గెలాక్సీ స్టోర్ యాప్లో లోపాలను గుర్తించామని పేర్కొన్నది. దీని ద్వారా సైబర్ నేరగాళ్లు శామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్ఫోన్ల యూజర్ల ఫోన్లలో అనుచిత యాప్లను ఇన్స్టాల్ చేసి బ్యాంకింగ్ వివరాల చోరీకి పాల్పడే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. శామ్సంగ్ గెలాక్సీ స్టోర్ యాప్ వెర్షన్ 4.5.49.8 కంటే ముందటి వెర్షన్ ఉన్న ఫోన్లకు దీని నుంచి ఎక్కువ ప్రమాదం ఉన్నదని తెలిపింది.