ముంబై: డ్రగ్స్ కేసులో ముంబై మాజీ ఎన్సీబీ ఆఫీసర్ సమీర్ వాంఖడే(Sameer Wankhede)కు ఊరట దక్కింది. ముంబై హైకోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరీ చేసింది. జూన్ 23వ తేదీ వరకు ఆయన్ను అరెస్టు చేయరాదు అని కోర్టు పేర్కొన్నది. షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను అరెస్టు చేసిన కేసులో సమీర్పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆర్యన్ను రిలీజ్ చేసేందుకు షారూక్ను సమీర్ 25 కోట్లు అడిగినట్లు సీబీఐ కేసు దాఖలైంది.
అక్టోబర్ 2021లో ఓ షిప్లో వెళ్తున్న ఆర్యన్ను ఎన్సీబీ పోలీసులు అరెస్టు చేశారు. తనపై నమోదు అయిన సీబీఐ కేసును కొట్టివేయాలని సమీర్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ కేసును జూన్ 23వ తేదీన విచారించనున్నట్లు జస్టిస్ ఏ గడ్కరీ, ఎస్జీ డిగేలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది.