మార్చి 11 న సీఎం యోగి లక్నో నుంచి గోరఖ్పూర్కు విమాన టిక్కెట్ బుక్ చేసుకున్నారనిసమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ మరోమారు ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత సమాజ్వాదీ చీఫ్ అఖిలేశ్ లండన్కు వెళ్లిపోనున్నారని బీజేపీ తీవ్ర ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అఖిలేశ్ యాదవ్ పై వ్యాఖ్యలు చేస్తూ బీజేపీకి కౌంటర్ ఇచ్చారు.
మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయని, సీఎం యోగి మార్చి 11న గోరఖ్పూర్కు విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్నారన్నారు. దీనిని బట్టే బీజేపీ నేతలు ఎంత భయపడుతున్నారో అర్థమైపోతోందని అఖిలేశ్ ఎద్దేవా చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా యూపీ ప్రజల్లో 440 ఓల్టుల కరెంట్ ప్రవహిస్తోందని, కానీ ఈ విషయం బీజేపీ నేతలకే తెలియదని అఖిలేశ్ అన్నారు.