లక్నో: మెయిన్పురి లోక్సభ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కోసం సమాజ్వాది పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ (44) నామినేషన్ దాఖలు చేశారు. ఈ మధ్యాహ్నం తన భర్త అఖిలేష్ యాదవ్తో కలిసి వెళ్లి ఆమె తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె తన మామ, సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకులు ములాయంసింగ్ యాదవ్ను గుర్తుచేసుకున్నారు. నేతాజీ (ములాయం) ఆశీర్వాదాలు తమకు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు.
కాగా, గత నెల 10న ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్పురి లోక్సభ స్థానం ఖాళీ అయ్యింది. దాంతో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన కుమారుడు డింపుల్ యాదవ్ను అక్కడి నుంచి బరిలో దించారు. ఇక్కడ అధికార బీజేపీ తన అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఇక కాంగ్రెస్, బీఎస్పీ, శివలాల్ యాదవ్కు చెందిన ప్రగతిశీల్ సమాజ్వాది లోహియా పార్టీలు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాయా.. లేదా..? అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.
కాగా, డింపుల్ యాదవ్ 2012లో కన్నౌజ్ పార్లమెంట్ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కన్నౌజ్ ఎంపీగా ఉన్న అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి కావడంతో లోక్సభ స్థానానికి రాజీనామా చేసి డింపుల్ను అక్కడి నుంచి బరిలో దించారు. అయితే 2019లో బీజేపీ అభ్యర్థి సుబ్రత్ పాథక్ చేతిలో డింపుల్ యాదవ్ ఓడిపోయారు. ములాయం మరణంతో ఇప్పుడు ఆమెకు మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టేందుకు మార్గం ఏర్పడింది.
ఇదిలావుంటే, మెయిన్పురి పార్లమెంట్ స్థానానికి డిసెంబర్ 5న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ క్రమంలో ఇవాళ మొదలైన నామినేషన్ ప్రక్రియ గడువు ఈ నెల 17తో ముగియనుంది.