లక్నో: ఉత్తరప్రదేశ్లోని ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) సమాప్త్ పార్టీగా మారుతోందని డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య విమర్శించారు. జరుగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 300కుపైగా స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో గురువారం మాట్లాడిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో సిరతు నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండటం ఆనందంగా ఉందన్నారు.
కాగా, ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్, అఖిలేష్ మామ ప్రమోద్ గుప్తా ఇటీవల బీజేపీలో చేరడంపై కేశవ్ ప్రసాద్ మౌర్య ఈ సందర్భంగా స్పందించారు. సమాజ్వాదీ పార్టీ, సమాప్త్ పార్టీగా మారుతోందని ఎద్దేవా చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీపైనా ఆయన విమర్శలు చేశారు. అవినీతిపరులపై చర్యలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, అవినీతికి తాము అనుకూలమని సూచిస్తోందన్నారు.