లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. 47 వేల ఓట్లకు పైగా మెజారిటీతో ఆయన గెలిచారు. ఆయనపై బీఎస్పీ నుంచి కుల్దీప్ నారాయణ్, బీజేపీ నుంచి ఎస్పీ సింగ్ బఘేల్ పోటీపడ్డారు. కాగా, అఖిలేష్ యాదవ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి తన పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయినప్పటికీ.. గతంలో కంటే ఎక్కువ స్థానాలను సాధించగలిగారు.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో జట్టుకట్టిన సమాజ్వాది పార్టీకి కేవలం 52 స్థానాలు మాత్రమే దక్కాయి. కానీ ఈసారి ఎస్పీ దాని మిత్రపక్షాలకు దాదాపు 130 స్థానాలు ఖాయమయ్యాయి. కాగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఒక ప్రతిపక్షానికి 100కు పైగా అసెంబ్లీ స్థానాలు దక్కడం ఇదే తొలిసారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.