RSS centenary : రాష్ట్రీయ స్వయం స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) శతాబ్ది ఉత్సవాలు ముంబైలో జరుగుతున్నాయి. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ వేడుకలకు ముంబైలోని బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ వంటి బాలీవుడ్ స్టార్స్ హాజరవ్వడం ప్రత్యేకంగా నిలిచింది.
బాలీవుడ్కు చెందిన టాప్ స్టార్స్, నిర్మాతలు, దర్శకులు సహా ప్రముఖులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. హిందూ సంస్థగా ముద్ర ఉన్న ఆరెస్సెస్ శతాబ్ది వేడుకలకు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరవ్వడం ఆసక్తికరంగా మారింది. ‘100 ఇయర్స్ ఆఫ్ సంఘ్ జర్నీ : న్యూ హారిజాన్స్’ పేరుతో, ముంబై, వర్లీలోని నెహ్రూ సెంటర్లో నిర్వహించిన ఈ వేడుకలకు ఆరెస్సెస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ అధ్యక్షత వహించారు. వేడుకలకు హాజరైన బాలీవుడ్ స్టార్స్ ఆరెస్సెస్ నేతలతో కలిసి చర్చిస్తూ కనిపించారు. అందరి ఉపన్యాసాలను శ్రద్ధగా విన్నారు. సాధారణంగా బాలీవుడ్ స్టార్స్ ఇలాంటి వేడుకలకు చాలా దూరంగా ఉంటారు. కానీ, శని, ఆదివారాల్లో జరిగిన వేడుకలకు బాలీవుడ్ మొత్తం హాజరైనట్లు కనిపించింది. కొందరు శనివారం హాజరైతే.. ఇంకొందరు ఆదివారం అతిథులుగా వచ్చారు.
సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, దర్శకులు మోహిత్ సూరి, కరణ్ జోహార్, నితీష్ తివారి, ఓం రౌత్, సుభాష్ ఘయ్, మహా వీర్ జైన్, విక్రమ్ మల్హోత్రా, గేయ రచయిత ప్రసూన్ జోషి, నటి అనన్యా పాండే, రవీనా టాండన్, శిల్పా శెట్టి, జాకీ ష్రాఫ్, రూపాలి గంగూలి, వినీత్ కుమార్ సింగ్, మాధుర్ భండార్కర్, మహేష్ మంజ్రేకర్, ఆనంద్ ఎల్ రాయ్, అమర్ కౌషిక్, అమిత్ శర్మ, రమేష్ తౌరాని, ఆనంద్ పండిట్, పూనమ్ ధిల్లాన్, హేమా మాలిని, అద్నాన్ సమీ, ప్రీతమ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.