జైపూర్: గత బీజేపీ పాలనలో అవినీతి,అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్(Sachin Pilot) ఇవాళ ఒక రోజు దీక్ష నిర్వహిస్తున్నారు. ఆ దీక్షపై కాంగ్రెస్ పార్టీ వార్నింగ్ జారీ చేసింది. ఇది పార్టీ వ్యతిరేకమని పేర్కొన్నది. వసుంధరా రాజే ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని గెహ్లాట్ ప్రభుత్వంపై సచిన్ వత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
#WATCH | Rajasthan Congress leader Sachin Pilot at Shaheed Samark in Jaipur begins his daylong fast calling for action on alleged corruption during the previous BJP government in the state pic.twitter.com/PeFLSRbYMq
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 11, 2023
నిజానికి కాంగ్రెస్ పార్టీ ఈ ఒక రోజు నిరాహార దీక్షకు వ్యతిరేకంగా ఉంది. ప్రభుత్వంతో ఏదైనా విబేధాలు ఉంటే, దాన్ని పార్టీ ఫోరమ్లో డిస్కస్ చేయాలని, కానీ మీడియాకు ఎక్కడం సరికాదు అని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ సుఖ్జిందర్ సింగ్ రాంధ్వా తెలిపారు.
Statement issued by Shri Sukhjinder Singh Randhawa, AICC In charge of Rajasthan. pic.twitter.com/PMn8aDdu0O
— INC Sandesh (@INCSandesh) April 10, 2023