జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ముదరుతున్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్ లక్ష్యంగా యువ నాయకుడు సచిన్పైలట్ విమర్శనాస్ర్తాలు సంధించారు. ఎన్నికల ముంగిట సొంతంగా ప్రచార పర్వం మొదలుపెట్టిన పైలట్.. ఇటీవల ఉపాధ్యాయ నియామక పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడాన్ని ప్రస్తావిస్తూ గెహ్లాట్ను ఇరుకున పెట్టారు.
‘కొన్ని సార్లు పేపర్లు లీక్ అవుతాయి. మరికొన్నిసార్లు పరీక్షలు రద్దవుతాయి. ఇది చాలా బాధాకరం. చదువు కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతారు. పరీక్ష కోసం విద్యార్థులు రేయింబవళ్లు కష్టపడి చదువుతారు. పేపర్ లీక్ వెనకున్న బడాబాబులను ప్రభుత్వం అరెస్ట్ చేయాలి’ అని సొంత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.