న్యూఢిల్లీ: రాజస్థాన్ కాంగ్రెస్ నిలువునా చీలనున్నదా? సీఎం గెహ్లాట్తో పాటు పార్టీ అధిష్ఠానం కూడా తన డిమాండ్లను పట్టించుకోకపోవడంపై అసంతృప్తితో ఉన్న సచిన్ పైలట్ కాంగ్రెస్ను వీడి కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్టు రాజకీయ వర్గా లు వెల్లడిస్తున్నాయి. ఈనెల 11న దౌసా పట్టణంలో తన తండ్రి రాజేశ్ పైలట్ వర్ధంతి సందర్భంగా కొత్త పార్టీని ప్రకటిస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ మేరకు తన అనుచరులతో అంతర్గతంగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. బీజేపీ ప్రభుత్వ అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రణాళికలో ఉన్న సచిన్ పైలట్కు.. కొత్త పార్టీ పెట్టడం తప్ప మరో ఆప్షన్ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.