న్యూఢిల్లీ, అక్టోబర్ 3: గత ఏడాది జేఈఈ మెయిన్స్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కేసులో సీబీఐ సోమవారం మిఖాయిల్ షార్గిన్ అనే ఓ రష్యన్ను అరెస్టు చేసింది. ఢిల్లీలోని విమానాశ్రయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నది. జేఈఈ మెయిన్స్ పరీక్షలో అక్రమాల కేసులో షార్గిన్ను ప్రధాన హ్యాకర్గా సీబీఐ అనుమానిస్తున్నది. పరీక్షకు సంబంధించిన సాఫ్ట్వేర్ను ట్యాంపరింగ్ చేశాడని, పలువురు అనుమానిత అభ్యర్థుల కంప్యూటర్లను హ్యాక్ చేయడంలో ఇతర నిందితులకు సాయం చేశాడని విచారణలో ప్రాథమికంగా తేలిందని అధికారులు తెలిపారు. షార్గిన్పై సీబీఐ ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీచేసింది.