న్యూఢిల్లీ : రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. ఆదివారం ఉక్రెయిన్లోని ఎల్వివ్లోని సైనిక స్థావరంపై రష్యా దళాలు పెద్ద ఎత్తున దాడి చేశాయి. ఈ సంఘటనలో తొమ్మిది మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 57 మంది వరకు గాయపడ్డనట్లు తెలిసింది. ఘటనకు సంబంధించి ఇంకా సమాచారం తెలియాల్సి ఉన్నది.
ఇదిలా ఉండగా.. ఇరుదేశాల మధ్య యుద్ధం ఆదివారం నాటికి 18వ రోజుకు చేరింది. ఓ వైపు ఉక్రెయిన్ నగరాలపై రష్యా సైన్యం దాడులు చేస్తుండగా.. ఉక్రెయిన్ సైతం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నది. ఇప్పటివరకు 13వేల మందికిపైగా రష్యా సైనికులను చంపినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్కు 200 మిలియన్ డాలర్ల సైనిక సాయాన్ని అందజేస్తామని అమెరికా ప్రకటించింది.