న్యూఢిల్లీ, జూలై 23: ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం తలెత్తకుండా ఉండటానికి రష్యా, ఉక్రెయిన్ చేతులు కలిపాయి. రష్యా బ్లాక్ చేసిన ఉక్రెయిన్ పోర్టులను తిరిగి పనిచేసేలా చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగా ఇరుదేశాల ప్రతినిధులు టర్కీలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటేరస్ సమక్షంలో సంతకాలు చేశారు.
దీంతో ఇప్పటి వరకు నిలిచిపోయిన ఆహార ధాన్యాల రవాణా తిరిగి ప్రారంభంకానున్నది. అయితే శత్రుదేశాలైన రష్యా, ఉక్రెయిన్ మధ్య ప్రస్తుతం యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఆహార ధాన్యాల రవాణా కోసం ఇరుదేశాలు సంతకాలు చేయడంపై ప్రపంచదేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే స్ఫూర్తితో యుద్ధానికి కూడా ముగింపు పలకాలని కోరుతున్నాయి.
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే పేలుడు సంభవించింది. ఉక్రెయిన్లోని ఒడెస్సాలో ఉన్న పోర్టుపైకి రష్యా క్షిపణులు దూసుకెళ్లాయి.