న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు రాజ్యసభలో ఏప్రిల్ నాటికి ఆధిక్యం వచ్చే అవకాశం కనిపిస్తున్నది. కొత్తగా గెలిచిన సభ్యులు, రాష్ట్రపతి నామినేటెడ్ విభాగంలో నియమించే ఆరుగురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మెజారిటీకి అవసరమైన సభ్యులు ఈ కూటమిలో ఉంటారు. రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉంటారు.
బిల్లులకు ఆమోదం లభించాలంటే కనీసం 123 మంది సభ్యులు అవసరం. ప్రస్తుతం ఎన్డీయేకు 113 మంది సభ్యులు ఉన్నారు. కీలక బిల్లులకు ఆమోదం లభించాలంటే రాజ్యసభలో మెజారిటీ తప్పనిసరి. అందుకే ప్రభుత్వం ఇప్పటి వరకు బీజేడీ, వైకాపాల మద్దతు తీసుకుని కొన్ని బిల్లులను ఆమోదించుకుంది.