కరోనా రూపాంతరం చెందుతుండటం, పలు దేశాల్లో కొత్త వేరియంట్లు వెలుగుచూస్తుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే అమెరికా, యూరప్, మధ్య ప్రాచ్యం దేశాలకు చెందిన ప్రయాణికులు భారత్కు వస్తే నిర్వహిస్తున్న ఆర్టీపీసీఆర్ పరీక్షను మరో ఏడు దేశాలకు వర్తింపజేయనుంది. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, బోత్సువానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే దేశాలకు చెందిన ప్రయాణికులు భారత్లో దిగగానే తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించాలని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. ఈ ప్రయాణికులు విమానం ఎక్కేటప్పుడు పరీక్ష చేసుకున్నా కూడా భారత్లో దిగగానే మళ్లీ పరీక్ష చేయాలని కోరింది.