RSS | నాగ్పూర్లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రాంతాన్ని నాగ్పూర్ పోలీసులు ‘నో డ్రోన్’ జోన్ గా ప్రకటించారు. ఈ నెల 28 నుంచి మార్చి 28 వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని ఆదివారం ప్రకటన చేశారు. నాగ్పూర్లోని మహల్ ప్రాంతంలో గల ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం పరిధిలో ఫోటోలు తీయడం, వీడియోలు చిత్రీకరించడం నిషేధం. సీఆర్పీసీ 144 (1)(3) సెక్షన్ ప్రకారం నిషేధాజ్ఒలు అమల్లో ఉంటాయి.
ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై ఐపీసీలోని 188 సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ప్రాంతం పూర్తిగా జనంతో రద్దీగా ఉంటుంది. హోటళ్లు, లాడ్జిలు, కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ ప్రాంతంలో తిరిగే వ్యక్తులు ఫొటోలు తీయడం గానీ, వీడియోలు చిత్రీకరించడం గానీ, ఖాళీ డ్రోన్ల వీడియో గ్రఫీ వల్ల ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పోలీసు అధికారులు తెలిపారు.